Home   »  వార్తలు   »   ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వైరు మారుస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వైరు మారుస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

schedule chiranjeevi

మెదక్: మెదక్ జిల్లా చెర్లపల్లి తండాలో మంగళవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుదాఘాతంతో 48 ఏళ్ల రైతు మృతి చెందాడు. బాధితుడు గురునాగులు తన పొలంలో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. మంగళవారం తన పొలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సదరు రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు చేరుకుని విద్యుత్‌ సరఫరాను పరిశీలించాడు.

వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త ఫ్యూజ్‌ వైర్‌ అమర్చుతుండగా విద్యుత్‌ వైర్లు తగిలి నాగులు అక్కడికక్కడే మృతి చెందాడు. నాగులుకు భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఈ ఘటన ఫై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.