హైదరాబాద్: ఇంజనీరింగ్ లో రెండో విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. 7,147 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా, మరో 25,148 మంది తమ సీట్లను మార్చుకున్నారు.
CSE, IT కోర్సుల్లో 94 శాతం, ఎలక్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో 78 శాతం, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్లో 43 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,013 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 4 నుంచి తుది విడత భర్తీ ప్రక్రియ మొదలుకానుంది.