Home   »  వార్తలు   »   పెళ్లి ఊరేగింపు లో లారీ ఢీకొని ఐదుగురు మృతి

పెళ్లి ఊరేగింపు లో లారీ ఢీకొని ఐదుగురు మృతి

schedule raju

భువనేశ్వర్: ఒడిశాలోని కియోంజర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కియోంజర్ పట్టణంలోని సతీఘర్ సాహి వద్ద జాతీయ రహదారి నంబర్ 20పై వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి పెళ్లి ఊరేగింపు పైకి దూసుకెళ్లింది. దీంతో పెళ్లి ఊరేగింపు లో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 1 నుంచి 1.30 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.