Home   »  వార్తలురాజకీయం   »   మంత్రి కేటీఆర్ ని కలిసిన గండ్ర దంపతులు.

మంత్రి కేటీఆర్ ని కలిసిన గండ్ర దంపతులు.

schedule mounika

మెట్రో భవన్ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా భూపాలపల్లి శాసన సభ్యులు వెంకట రమణా రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి కేటీఆర్ తో పలు అంశాలపై చర్చించారు. అకాల వర్షాలతో నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, విద్యుత్తు పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించాలని కోరారు. వరద ప్రభావానికి పూర్తి దెబ్బతిన్న మోరాంచపల్లి గ్రామానికి అండగ నిలవాలని కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ కి ఇటీవలే ప్రకటించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. నూతనంగా కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ఔటర్ పనుల్ని వేగవంతం చేశామని, భూ సేకరణ పనులు జరుగుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. రైతుల రుణమాఫీ అమలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని,ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో వీలినం చేయడం శుభ సూచికమని తెలిపారు. సెప్టెంబర్ 08వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకకు కుటుంబ సమేతంగా రావాలని మంత్రిని కోరారు.