Home   »  వార్తలు   »   ఘోర ప్రమాదం.. విషవాయువు లీకై 16 మంది మృతి.!

ఘోర ప్రమాదం.. విషవాయువు లీకై 16 మంది మృతి.!

schedule raju

గ్యాస్ లీకేజీ: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని మురికివాడలో విషవాయువు లీక్ కావడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. ఈ సంఘటన జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ సమీపంలోని అనధికారిక సెటిల్‌మెంట్‌లో బుధవారం రాత్రి జరిగింది. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు వినియోగించే గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విషపూరిత గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీ వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు.