హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధునిక విధానాల వల్ల గత తొమ్మిదేళ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, ఫలితం గా 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మట్టం భిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవంలో కవిత మాట్లాడారు. కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని చెప్పడానికి భిక్షపతినే నిదర్శనమని ఆమె అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నా ప్రయివేటు రంగంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ,రాష్ట్ర పారిశ్రామిక విధానం విజయవంతం కావడానికి పారదర్శకత కారణమని కవిత అన్నారు.