మహబూబ్ నగర్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన phaco machine ని ప్రొహిబిషన్, టూరిజం, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను కంటిలో పొర తొలగింపు కోసం ఈ శస్త్ర చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
phaco machine ప్రారంభించినా సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని ఆధునిక, అత్యాధునిక పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కోసం వెళ్లే రోగుల ఇప్పుడు ఇక్కడే వైద్యం అందేలా చేసింది మా తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు 18 మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం GHMC లో 220మంది ఉన్నారు. ఒక్కో ఫార్మాసిస్టుకు 40 మంది ఉండగా, లేబొరేటరీ అసిస్టెంట్ల సంఖ్య 2 నుంచి 38కి పెరగడంతో వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం వల్లనే ఈ మార్పు సాధ్యమైంది అని అన్నారు.