ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 16 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. IT శాఖలో రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు.. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటీశాఖ నుంచి పలువురు రీఫండ్ పొందినట్లుగా వెలుగులోకి తెచ్చారు IT అధికారులు. ఈ స్కామ్లో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించారని IT శాఖ అధికారులు గుర్తించారు.
ఐటీ సోదాలు నిర్వహించిన ప్రాంతాలు: హైదరాబాద్లో 8 ప్రాంతాలతోపాటు.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే.. ఆదాయపు పన్ను శాఖలో భారీగా నిధులు స్వాహా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐటీ అధికారులు. సోదాలు పూర్తయితే ఎంత మేర కుంభకోణం చేశారో తెలియనుంది.