హన్మకొండ: ఆర్థిక మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కమలాపూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం (మంగళవారం) బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పార్టీ అధిష్టానం మైనంపల్లి హనుమంత రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ నిరసనకు దిగారు. ఈ నిరసనలో శ్రీకాంత్, లక్ష్మణరావు, నవీన్ కుమార్, రవీందర్, కుమారస్వామి, వినోద్ వీరేశం, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.
కమలాపూర్ : హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం
Related News
Also Read