Home   »  వార్తలుతెలంగాణరాజకీయం   »   10 వేల ఎకరాలు కబ్జా చేసిన కేసీఆర్ కుటుంబం..

10 వేల ఎకరాలు కబ్జా చేసిన కేసీఆర్ కుటుంబం..

schedule yuvaraju

తెలంగాణ: హైదరాబాద్ చుట్టుపక్కల 10వేల ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందని రూ.లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం అని అన్నారు. తెలంగాణపై మోజు తీరిపోవడం తో ముంపు ప్రాంతాలను సందర్శించకుండానే కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోని కేసీఆర్ కుటుంబం మనకు అవసరమా అని రేవంత్ ప్రశ్నించారు. శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, సంఘం మాజీ నాయకుడు ఎలువాక రాజయ్య, సుల్తానాబాద్ మునిసిపల్‌ వైస్ చైర్మన్ బిరుదు సమేత, సింగిల్‌ విండో చైర్మన్ వామనరావు తదితరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నిజంగా తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలనుకుంటే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వండి. రాక్షసులందరినీ పుట్టించిన బ్రహ్మరాక్షసుడు కేసీఆరేనని, ఈ బ్రహ్మరాక్షసుని మందులతో చంపే సమయం వచ్చిందన్నారు. న్యాయం కోసం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి. పార్టీ జెండా మోసినవారిని కాంగ్రెస్‌ పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు.