హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ED రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల పలువురు BRS నేతల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురిని విచారణకు ఆదేశిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ఇప్పుడు మెడికల్ కాలేజీలు టార్గెట్గా ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ED సోదాలు నిర్వహిస్తోంది. SVS, కామినేని సహా పలు మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టింది. కామినేని హాస్పిటల్స్ గ్రూప్పై ED సోదాలు నిర్వహిస్తోంది.
కామినేని గ్రూప్ చైర్మన్, MD నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. శశిధర్ కామినేని, వసుంధర కామినేని, కామినేని సూర్యనారాయణ, గాయత్రిదేవి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కింగ్కోఠిలోని కామినేని ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. బషీర్బాగ్లోని ED కార్యాలయం నుంచి ED అధికారులు 11 బృందాలుగా బయలుదేరారు. భారీ సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ED బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో ED దాడులు చేసే అవకాశం ఉంది.