హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ కొత్త సచివాలయం వద్ద గోషామహల్ ఎమ్మెల్యేను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలోకి రాజాసింగ్ను అనుమతించలేదు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ. హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను ఆహ్వానించారని తెలిపారు. తలసాని ఆహ్వానం మేరకే తాను సచివాలయానికి వచ్చానని స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా సిబ్బంది రాజాసింగ్ను లోనికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు.