Home   »  వార్తలు   »   హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి.

హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి.

schedule chiranjeevi

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌ గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌ ఇన్‌ చార్జిగా కౌశిక్‌ రెడ్డిని నియమించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీలో ఉండనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే వెంటనే.. ప్రభుత్వ విప్ గా కేసీఆర్ నియమించారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.