Home   »  వార్తలుతెలంగాణ   »   రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

schedule raju

పలు సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన వానకాలం రైతుబంధు పెట్టుబడి పంపిణీని ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. గత 3 రోజుల నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. శుక్రవారం 49,990 మంది రైతుల ఖాతాల్లో రూ.136.54 కోట్ల నిధులను జమ చేసింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 63.34లక్షల మంది రైతుల ఖాతాల్లో 1.13 కోట్ల ఎకరాలకు గాను రూ.5,694.90 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.