ఇటీవల మణిపూర్లో ఇద్దరు బాలికలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే మణిపూర్లో జరిగిన అల్లర్లే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన అంశంగా మారాయి. ఈ విషయంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ఎంపీలు ఒత్తిడి చేయడంతో ఉభయ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన విపక్ష నేతల సమావేశంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.