Home   »  తెలంగాణవార్తలు   »   పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో 40 మందికి గాయాలు…..

పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో 40 మందికి గాయాలు…..

schedule yuvaraju

పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. రోడ్డు డివైడర్ ను ఢీకొని ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామగుండంకు చెందిన ఓ కుటుంబం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లి ఉదయం స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదానికి గురైంది.

ఆటో రిక్షాను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. 20 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ‘108’ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లి ACP మహేష్, సుల్తానాబాద్ CI జగదీష్, SI విజయేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.