హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు జూన్ 21న ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండగా జూన్ 26 నాటికి రాష్ట్రం మొత్తం రుతుపవనాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
గతంతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో రుతుపవనాల ఆలస్యం వల్ల ఉష్ణోగ్రత్త 47 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగింది దీనివల్ల తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.
గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 13న రాగా, 2020, 2021లో వరుసగా జూన్ 5 నుండి జూన్ 11 మధ్య సంభవించాయి. రుతుపవనాల రాక తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది.