Home   »  వార్తలుజాతీయం   »   కార్గిల్ సైనికులకు నివాళులు అర్పించిన ప్రధాని….

కార్గిల్ సైనికులకు నివాళులు అర్పించిన ప్రధాని….

schedule yuvaraju

కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు.

ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. “ఈ రోజు దేశానికి స్ఫూర్తినిచ్చిన యోధుల వీరోచిత పోరాటాన్ని సూచిస్తుంది, వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను జైహింద్‌ ట్వీట్ చేశాడు.