హైదరాబాద్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 10 మందిని సైబరాబాద్, రాజేంద్రనగర్ ప్రత్యేక టాస్క్ఫోర్స్తో పాటు వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.95 లక్షల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
2.53 టన్నుల విడి విత్తనాలు, 2900 ప్రణతి పత్తి విత్తనాల ప్యాకెట్లు, 9765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, ఐదు మొబైల్ ఫోన్లతో పాటు రూ.75 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.