హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్లోని వెంకటపురంలో శుక్రవారం ఉదయం పోలీసులు వ్యభిచార ముఠా గట్టురట్టు చేశారు. వ్యభిచారం చేస్తున్న తొమ్మిది మంది యువతులు, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వ్యభిచార ముఠా గట్టురట్టు చేసిన పోలీసులు..
Related News
Also Read