Home   »  వార్తలుతెలంగాణ   »   రైతు బంధు పంపిణీ జూన్ 26 నుంచి

రైతు బంధు పంపిణీ జూన్ 26 నుంచి

schedule sirisha

హైదరాబాద్‌: 2023 సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు రైతు బంధు నిధులు ఇవ్వడానికి జూన్‌ 26న ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

రైతు బంధు పథకం అనేది తెలంగాణలో ప్రారంభించబడిన రైతు పెట్టుబడి పథకం ఇందులో ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడిగా ప్రతి ఎకరా భూమికి రూ. 5000 ప్రోత్సాహకం ఇస్తుంది.

రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ అయ్యేలా చూడాలని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావులను కేసీఆర్‌ ఆదేశించారు.