Home   »  వార్తలుతెలంగాణరాజకీయం   »   రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా సాయిచంద్ భార్య‌….?

రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా సాయిచంద్ భార్య‌….?

schedule yuvaraju

హైద‌రాబాద్: రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ గా వేద ర‌జ‌ని నియామ‌కం కానుంది. ఆ సంస్థ చైర్మ‌న్‌గా ఉన్న గాయ‌కుడు సాయిచంద్‌ ఇటీవ‌లే గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాయిచంద్ భార్య ర‌జ‌నికే రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ పోస్టును ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు సాయిచంద్ భార్య ర‌జ‌నిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌నుంది.

సాయిచంద్‌ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.