భైంసా: పోస్టల్ శాఖ మహిళల కోసం ప్రత్యేకంగా చిన్నమొత్తాల పొదుపు పథకం ప్రవేశపెట్టిందని భైంసా పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ సుశ్మిత బెనర్జీ అన్నారు. 2023లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మాల్ సేవింగ్స్ స్కీమ్ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిందన్నారు. ఈ పథకంలో డిపాజిట్లపై ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తుందని, త్రైమాసికానికి కలిపి ఖాతాలో వడ్డీ జమవుతుందని తెలిపారు. బైంసా డివిజన్లోని అన్ని పోస్ట్ ఆఫీస్లలో ఈ ఖాతాలు తెరుచుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించి ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు అయ్యేలా చూడాలని కోరారు. ఈ పథకంలో అందిస్తున్న వడ్డీ పథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం పోస్టల్ సిబ్బంది, పోస్టల్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
మహిళల కోసం పొదుపు పథకం
Related News
Also Read