ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని 302 మండలాలు తీవ్ర వేడిగాలులకు గురవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) తెలిపింది.
APSDMA ప్రకారం కాకినాడ జిల్లాలోని బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం, తుని మండలాలు, జామి, కొత్తవలస మండలాలు. విజయనగరం జిల్లా పద్మాభంపట్నం మండలాలు….మొదలగు మండలాలలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది అని తెలిపారు.