Home   »  వార్తలుజాతీయం   »   వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి

వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి

schedule raju

UPలోని బారాబంకిలో వందేభారత్‌ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్‌ కిటికీలు పగిలిపోయాయి. ఆగ్రా రైల్వే డివిజన్ లోని భోపాల్ నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ వరకు నడుస్తున్న వందేభారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో C-7 కోచ్‌లోని సీట్ నంబర్ 13-14 కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.. ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. దీనిపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్స్‌పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఎలాంటి పరిస్థితులు కనిపించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడంతోపాటు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, గత నెలలో అయోధ్యలోనూ వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది.