తాండూరు: మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే పార్టీని వీడి, హస్తం గూటికి వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరి అస్త్రంగా గులాబీ బాస్ దగ్గర లాబీయింగ్ చేయడంతో పాటు కాంగ్రెస్ను వీడితే ఎలా ఉంటుందోనని సొంతంగా అంతర్గత సర్వేను కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అందుకే కాంగ్రెస్ పెద్దలు కుడా పట్నం ఫ్యామిలి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తాండూరు MLA గా పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతామహేందర్ రెడ్డిని చేవెళ్ల ఎంపీగా కాంగ్రెస్ అఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పట్నం తమ్ముడు నరేందర్ రెడ్డి కూడా బిఆర్ఎస్ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తన సోదరుడితో కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే తాజాగా పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ రాకపోతే పార్టీ మారడం ఖాయమనేది ప్రచారం జరుగుతోంది. బిఆర్ఎస్ పెద్దలు తాండూర్పై ఏది తేల్చలేక పోవడం పట్నంకు ఇబ్బందిగా మారుతుందట. గులాబీ బాస్ ఇలానే సాగదీస్తే శ్రవణంలో ఒక మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ గూటికి వెళ్లడం పక్కాగా కనిపిస్తుంది.