Home   »  వార్తలు   »   ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

schedule chiranjeevi

తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రెడ్డి రాజకీయాలు, కమ్మ రాజకీయాలు, కాపు రాజకీయాలు ఇలా భిన్న రాజకీయాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఏపీ ప్రజలను కూడా కేసీఆర్ ఆదుకుంటున్నారని మల్లారెడ్డి స్పష్టం చేశారు. పోలవరం కట్టింది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది కేసీఆర్ అని ఉద్ఘాటించారు.

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ లాంటి డైనమిక్‌ మంత్రి దేశంలోనే లేరన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల వల్ల ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్లు ఇస్తూ కేసీఆర్ పెద్ద కొడుకులా వారికి అండగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ ప్రాంతంలోనూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను విమర్శించే వారందరూ గాలికి కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.