తెలంగాణ: ఖైదీల పట్ల మంచిగా ప్రవర్తించి వారి నుంచి డబ్బు సంపాదించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన విధానాలు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం చంచల్గూడ జైలులో ఢిల్లీ జైళ్ల శాఖ వార్డర్ల పాసింగ్ ఔట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన జైళ్లు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి జైళ్ల డీజీ, ఐజీలు వస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని జైళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయన్నారు.
పోలీసింగ్లో ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్ అని కొనియాడారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జితేంద్ర మాట్లాడుతూ ఖైదీల్లో మార్పులు తీసుకొచ్చేందుకు జైలు సిబ్బంది నిరంతరం శ్రమించాలని సూచించారు. ఖైదీల పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని 130 మంది వార్డర్లకు 7 నెలల పాటు శిక్షణ ఇచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ రాజేష్ తెలిపారు. పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వార్డర్లను మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో డీఐజీ శ్రీనివాస్, మురళీబాబు, ప్రిజన్ ట్రైనింగ్ అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, చర్లపల్లి, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.