Home   »  తెలంగాణవార్తలు   »   కరీంనగర్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్

కరీంనగర్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్

schedule sirisha

కరీంనగర్‌లో ని వీ-కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 24, 25 తేదీల్లో సీనియర్స్, అండర్-13 విభాగాలకు రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ జరగనుంది.

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ CEO ప్రియాంక టోర్నీ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. విజేతలు రూ.50,000 ప్రైజ్ మనీ అందుకుంటారు.

కరీంనగర్‌లో జరగనున్న చెస్ టోర్నమెంట్ కోసం సీనియర్లకు ప్రవేశ రుసుము రూ. 500 కాగా అండర్-13 విభాగంలో పాల్గొనే వారికి ప్రవేశ రుసుము లేదు.

ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 20 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సందేహాల కోసం 8341206989, 9160160161 నంబర్‌లను సంప్రదించండి.