లోక కళ్యాణార్థం భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మిస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Lord Venkateswara ) వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు “విష్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం, అగ్నిప్రణయనం, కుంభారాధనం, ఉక్తహోమములు, పంచగవ్యక్షీరాధివాసములు, అధివాసహోమములు, హారతి” కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు.
వెంకటేశ్వర స్వామి( Lord Venkateswara ) వారి దర్శనార్థం నియోజకవర్గ నలుమూలల నుంచి వేంచేసిన భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో గ్రామంలోని ప్రజలందరి పై, వెంకటేశ్వర స్వామి వారి చల్లని చూపు ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా,సస్యశ్యామలంగా ఆర్థికంగా ఎదగాలని నిర్వహిస్తున్న,ఈ వేడుక కార్యక్రమాల్లో ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
మరో రెండు రోజులు నిర్వహించే విశిష్ట కార్యక్రమాలు,పూజా వేడుకల్లో నియోజకవర్గ ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని తెలియజేశారు.