హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రఘునందర్రావు కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు.
నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు కిషన్రెడ్డి, రఘునందర్రావు. దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి వారిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు.