బెంగళూరు: బెంగళూరులో భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో తన భార్య వేలిని కొరికి మింగినందుకు భర్త పై FIR నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
పుష్పకు విజయ్కుమార్తో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి విజయ్ పెట్టె చిత్రహింసలు భరించలేక ఇంటి నుంచి వెళ్లి విడిగా జీవనం కొనసాగిస్తోంది. పుష్ప ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు విజయ్కుమార్.
వాదనలో అతను ఆమె ఎడమ చేతిపై ఒక వేలు కొరికి తిన్నాడని, వేలు తిన్న విధంగానే చంపి తినేస్తానని భార్యను కూడా నిందితుడు బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయ్ ని అరెస్ట్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు.