కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ వేదిక పై ప్రశంసలు అందుకుంది. తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ తరుణంలో సాగునీరు మరియు తాగునీటికి సంబంధించి అద్భుతమైన విజయగాథలను నమోదు చేయడంలో ప్రభుత్వం చేసిన స్మారక ప్రయత్నాలను ప్రపంచం గుర్తించింది ప్రశంసించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరియు ప్రతిష్టాత్మకమైన తాగునీటి ప్రాజెక్ట్ అయిన మిషన్ భగీరథ వంటి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు USAలోని సివిల్ ఇంజనీర్ల నుండి ప్రశంసలు అందుకున్నాయి. అమెరికాలోని నెవాడాలో జరిగిన ప్రపంచ పర్యావరణ మరియు జలవనరుల సర్వేలో తెలంగాణ యొక్క శాశ్వతమైన ఇంజినీరింగ్ ఔన్నత్యానికి చిహ్నాలుగా నిలిచాయి మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) నుండి ప్రపంచ వేదిక పై గుర్తింపు పొందింది.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్టనర్షిప్’ అని ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావుకు ఎఎస్సిఇ ప్రెసిడెంట్ మరియా సి. లెహ్మాన్ గారి చేతుల గా మీదు ప్రశంసా పత్రాన్నిఅందిచారు.