Home   »  వార్తలు   »   నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది.

నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది.

schedule chiranjeevi

హైదరాబాద్: హైదరాబాద్‌లోని సాలిబండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన డి.సురేఖ(24) 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది.సురేఖ తన సోదరితో కలిసి హైదరాబాద్‌లోని షంషీర్‌గంజ్‌లో నివసిస్తోంది. సోమవారం నాడు సురేఖ నిశ్చితార్థం జరిగింది. మంగళవారం తిరిగి హైదరాబాద్ వచ్చారు. కాగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సురేఖ సోదరి పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ తర్వాత సురేఖ తాళం వేసి ఆత్మహత్య చేసుకుంది.

మధ్యాహ్నం వరకు కూడా సురేఖ బయటకు రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. దీంతో యజమాని తన సోదరికి సమాచారం ఇచ్చాడు. స్థానికుల సహాయంతో తన సోదరి తలుపులు పగలకొట్టారు అప్పటికే సురేఖ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీంతో సురేఖ సోదరి శాలిబండ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తిగత కారణాలతో సురేఖ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.