హైదరాబాద్: హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన పద్మ (53), ఆమె కూతురు ధనలక్ష్మి (28), ధనలక్ష్మి కుమారుడు అభినవ్ (7) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
గ్యాస్ లీకేజీ ఘటనలో ముగ్గురి మృతి…
Related News
Also Read