Home   »  వార్తలుఉద్యోగంజాతీయంతెలంగాణరాజకీయం   »   100 మంది MRO లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు..

100 మంది MRO లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు..

schedule yuvaraju

తెలంగాణ: 100 మంది ఎమ్మార్వోలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) నాయకులు సెక్రటేరియట్ లో ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. TRESA అధ్యక్షులు శ్రీ వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ కె. గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ కె. నిరంజన్, శ్రీ పి. రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ ఎం. జనార్దన్ రెడ్డి, శ్రీమతి శ్రీలత, శ్రీ వెంకన్న, జిల్లాల అధ్యక్షులు శ్రీ రమణ్ రెడ్డి, శ్రీ వెంకటేష్, శ్రీమతి సుమ సీఎంను కలిసి రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.