Home   »  వార్తలు   »   నేడు TS EDCET పరీక్ష ఫలితాల విడుదల

నేడు TS EDCET పరీక్ష ఫలితాల విడుదల

schedule sirisha

నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికి సంబంధించిన TS EDCET ఫలితాలను సాయంత్రం 4 గంటలకు తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ – https://edcet.tsche.ac.in/ – అభ్యర్థి లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొత్తం అభ్యర్థుల్లో 97.58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అందులో బాలికలు 76.07 శాతం మంది అర్హత సాధించారని పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 206 బీఎడ్ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నవంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని రెడ్డి తెలిపారు. TS EDCET 2023 ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున TSCHE ద్వారా రెండు సంవత్సరాల B.ED కోర్సులో ప్రవేశం కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించబడుతుంది.