Home   »  వార్తలు   »   విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

schedule sirisha

కర్నాటకలోని తుమకూరు జిల్లాలో సోమవారం జరిగిన ఒక సంఘటనలో ఒక రైతు, రైతు కుమార్తె వారి పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందారు.

ఈ ఘటన పావగడ తాలూకాలోని బసవనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. మృతులు రామకృష్ణారెడ్డి (65) గా గుర్తించారు. రామకృష్ణ గ్రామ సమీపంలోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బోరుబావి దగ్గర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

పొలానికి వెళ్లిన తన తండ్రి చాలా సేపటి వరకు ఇంటికి రాకపోవటంతో తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన కూతురు నిర్మల అతడిని ముట్టుకోగానే కరెంటు షాక్ తగిలి తాను కూడా మృతి చెందింది అని పావగడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.