హైదరాబాద్: నగరంలోని మైలార్దేవ్పల్లిలో ఇద్దరు ఫుట్పాత్ నివాసితులు హత్యకు గురయ్యారు.
దుర్గా నగర్ మైలార్దేవ్పల్లి వద్ద ఫుట్పాత్ నివాసితులు ఎవరనేది ఇంకా నిర్థారణ కాలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను మార్చురీకి తరలించి శవపరీక్ష నిమిత్తం భద్రపరిచారు.
మూడు రోజుల క్రితం మరో వ్యక్తి ఇదే విధంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులను అదే వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు హంతకుడిని గుర్తించేందుకు పోలీసులు సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.