గత కొన్ని రోజులుగా దేశ రాజధానిని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక విషాద సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఉత్తర ఢిల్లీ లోని సబ్జీ మండి ప్రాంతంలో ఇంటి గోడ కూలి ఓ మహిళ మృతి చెందింది.
రోహిణిలో చెట్టు విరిగిపడి ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చెట్టు ఆటోపై పడిపోవడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కాకుండా ఢిల్లీ లో వర్షం కారణంగా వేర్వేరు ఘటనల్లో మరో ఐదుగురు గాయపడ్డారు.