వరంగల్: గతంలో రఘునాథపల్లి పోలీస్స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా పనిచేసి ఆ తర్వాత వేకెన్సీ రిజర్వ్కు పంపిన ఎన్.వీరేందర్ వ్యవసాయ భూముల వివాదంలో బాధితులను వేధించినందుకు సస్పెన్షన్కు గురయ్యారు.
ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాదంలో నిందితులకు వీరేందర్ సహకరించి బాధితులను వేధిస్తున్నట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూ వివాదంపై అధికారులు జరిపిన విచారణకు వీరేందర్ సహకరించలేదని కూడా పేర్కొంది.