Home   »  రాజకీయం   »   రాజధాని పరిధిలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం 266 మంది పోటీ..

రాజధాని పరిధిలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం 266 మంది పోటీ..

schedule mounika

హైద్రాబాద్ : రాజధాని పరిధిలో ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున టిక్కెట్ల కోసం ఏకంగా 266 మంది నాయకులు పోటీపడుతున్నారు. ఒకట్రెండు నియోజకవర్గాలకు తప్ప మిగిలిన అన్నిచోట్ల ఒక్కో సెగ్మెంట్ నుంచి ఐదుగురి నుంచి ఇరవై మందికి పైగా నేతలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. వచ్చే నెల 2న జాబితాను కుదించి అదే నెల 4న స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ జాబితాను పరిశీలించింది. మొత్తం మీద వచ్చే నెల రెండోవారం నాటికి అభ్యర్థుల మొదటి జాబితా వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. గోషామహల్ కు 15మంది.. భారాస అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే అందిన దరఖాస్తుల పరిశీలనను మంగళవారం చేపట్టింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏకంగా 21 మంది నేతలు టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు.