Congress | తెలంగాణ కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగుతోంది. పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సహా పలువురు నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పార్టీలో జోష్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ హవా ప్రారంభమైంది. ఇక ఎన్నికల్లో విజయం సాధించాక పార్టీలోకి చేరికలు బీభత్సంగా పెరిగాయి. నేతలకు కావాల్సింది అధికార పార్టీలో ఉండటం, ప్రతిపక్షంలో ఉంటే ఏమోస్తుంది? అందుకే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కావున BRS నుంచి రోజురోజుకూ చేరికలు పెరుగుతున్నాయి. ఇక నేతల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా హాట్ టాపిక్గా మారింది.
కానిపర్తి గ్రామంలో BRSకు షాక్ (Congress)
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు BRSను వీడి కాంగ్రెస్లో చేరారు. శనివారం హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. కాంగ్రెస్లో చేరిన వారిలో దెబ్బేట అశోక్, ఇసంపెల్లి ఉపేందర్, కొత్తూరి ఇంద్రసేన, జనగాని ప్రభాకర్ ఉన్నారు.
Also Read | తెలంగాణలో 17 MP సీట్లు గెలుచుకుంటాం: బండి సంజయ్