Home   »  రాజకీయం   »   ప్రజాశాంతి పార్టీలో చేరిన నటుడు బాబు మోహన్

ప్రజాశాంతి పార్టీలో చేరిన నటుడు బాబు మోహన్

schedule mahesh
actor babu mohan joined the praja shanti party

Actor Babu Mohan | ఇటివలే భారతీయ జనతా పార్టీ (BJP)కి రాజీనామా చేసిన లెజెండరీ తెలుగు నటుడు బాబు మోహన్ మార్చి 4, సోమవారం రోజున KA పాల్ యొక్క ప్రజా శాంతి పార్టీలో చేరారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ జిల్లా నుంచి ప్రజా శాంతి పార్టీ టికెట్‌పై బాబూమోహన్ పోటీ చేయనున్నారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్న డాక్టర్ KA పాల్ తరపున కూడా ప్రచారం చేస్తానని బాబు మోహన్ మీడియా ప్రతినిధులతో తెలిపారు. KA పాల్‌ను ప్రశంసిస్తూ, PSP చీఫ్ “తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అపరిమిత నిధులు” తీసుకురాగలరని బాబు మోహన్ వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ టికెట్ ఆశించి భంగపడ్డ బాబూమోహన్ ఫిబ్రవరి 7న బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. బాబూ మోహన్ 2018, 2023లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు.

Also Read | BRS MP Candidates | BRS ఎంపీ అభ్యర్థుల ప్రకటన..!