ప్రధానాంశాలు
Aizawl: నవంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మిజోరంలో 16 మంది మహిళలతో సహా మొత్తం 174 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి శనివారం తెలిపారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు స్థానిక పార్టీ అయిన జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM) మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
27 మంది స్వతంత్ర అభ్యర్థులు
బీజేపీ 23 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రతిపాదించగా, 27 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. చాలా రాజకీయ పార్టీల రాష్ట్ర యూనిట్ అధ్యక్షులు – ముఖ్యమంత్రి జోరమ్తంగా (MNF), లాల్సవతా (కాంగ్రెస్), లాల్దుహోమా (ZPM), వన్లాల్ముకా (BJP) ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Aizawl నుంచి పోటీ చేస్తున్న సభ్యులు
MNF అధినేత జోరంతంగా ఐజ్వాల్ (Aizawl) ఈస్ట్-1 స్థానం నుంచి, బీజేపీ రాష్ట్ర చీఫ్ వన్లాల్ముకా దంపా స్థానం నుంచి, కాంగ్రెస్ మిజోరం యూనిట్ చీఫ్ లాల్సవతా ఐజ్వాల్ వెస్ట్-3 నుంచి పోటీ చేస్తున్నారు. ZPM ప్రెసిడెంట్ లాల్దుహోమా సెర్చిప్ స్థానం నుండి తిరిగి ఎన్నికను కోరుతున్నారు.
మిజోరాంలోని 11 జిల్లాల్లో ఐజ్వాల్ (Aizawl) జిల్లాలోని 12 స్థానాల్లో అత్యధికంగా 55 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, అత్యల్ప సంఖ్యలో ముగ్గురు అభ్యర్థులు హ్నాథియాల్ జిల్లాలోని ఒక్క స్థానంలో ఎన్నికల బరిలో ఉన్నారు.
అక్టోబర్ 20 నామినేషన్లకు చివరి తేదీ
నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 20 (శుక్రవారం) చివరి తేదీ కాగా, సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 మంది మహిళలు సహా మొత్తం 209 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గత ఎన్నికల్లో 209 మంది అభ్యర్థుల్లో 81 మంది పురుష అభ్యర్థులు, 16 మంది మహిళలు డిపాజిట్లు కోల్పోయారు.
Also Read: 83 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ