మరికొన్ని నెలల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగా MP బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర జమ్మికుంట మండలం శాయంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 17 MP సీట్లు (MP seats) కచ్చితంగా తామే గెలుస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
గడచిన పది సంవత్సరాలలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది. ‘రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై CBIతో విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉంది అని తెలిపారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు కాలయాపన చేస్తోంది? సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?’ అని సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read | కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన కేంద్ర మంత్రి..!