దేశరాజుపల్లి | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ కు కమలాపూర్ మండలంలో అత్యధిక ఓట్లు వేయించిన ఘనత దేశరాజుపల్లి (Desharajupalli) కాంగ్రెస్ పార్టీ నాయకులదే అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ ప్రణవ్ అన్నారు. అదే ఊపుతో నేడు అదే గ్రామంలోని BRS పార్టీకి చెందిన దాసరి ధనాకర్, పోతన బోయిన రాజ్ కుమార్, సముద్రాల శ్రీనివాస్, మర్రిపల్లి సమ్మయ్య, మోకిలే దామోదర్, రవీందర్, రమేష్, రంజీత్, సంధాని మరియు ౩౦ మంది నాయకులు సముద్రాల కృష్ణ, సముద్రాల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Desharajupalli | ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రణవ్ అన్నారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చెరుపల్లి రామచంద్రం, నాంపల్లి ప్రభాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read | BRS నుంచి కాంగ్రెస్లోకి చేరికలు