Home   »  రాజకీయం   »   రేవంత్ రెడ్డి ని కలసిన BRS ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..

రేవంత్ రెడ్డి ని కలసిన BRS ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..

schedule mounika

హైదరాబాద్: బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిశారు.

కాంగ్రెస్ పార్టీ లో చేరనున్న BRS ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..

కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన టికెట్లలో..బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఈ సారి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్‌ జాదవ్‌ ను బరిలోకి దింపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ లో చేరాలని BRS ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌, మాదాపూర్‌ కార్పొరేటర్‌ వీ జగదీశ్వర్‌ గౌడ్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్‌, కొడంగల్‌, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కూడా రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు రాంరెడ్డి, సాంబయ్యగౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కేడర్ ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలానికి చెందిన పలువురు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.