ప్రధానాంశాలు
కరీంనగర్ : BRS పార్టీలో చేరినప్పటి నుండి తనకు ఏమాత్రం గుర్తింపు ఇవ్వకపోవడం మూలంగానే పార్టీ మారుతున్నట్లు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్(Mohan) అన్నారు.
బీజేపీలో చేరి పోటీకి సిద్ధమవుతున్న Mohan
గురువారం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ వద్ద మానకొండూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, ఆయన శ్రేయోభిలాషులతో కలిసి BJP పార్టీలో చేరడానికి హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్(Mohan) మాట్లాడుతూ… తాను నియోజకవర్గానికి స్థానికుడినని, సుపరిచితుడినని, గతంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, ప్రజలు వచ్చే ఎన్నికలో తనకు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.
బీఆర్ఎస్ నన్ను పట్టించుకోలే : ఆరెపల్లి మోహన్
BRS పార్టీకి తాను ఎంత విధేయుడుగా ఉండి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, వారు తనను నిర్లక్ష్యం చేశారని ఆరెపల్లి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి అహర్నిశలు సేవ చేసే స్థానికుడిని రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
బిజెపిలో చేరి సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో తన వంతు సేవలను అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బిజెపి శ్రేణులు, ఆయన శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.