Home   »  రాజకీయం   »   సొంత పార్టీ పై అసహనం వ్యక్తం చేసిన: ఉమాభారతి

సొంత పార్టీ పై అసహనం వ్యక్తం చేసిన: ఉమాభారతి

schedule mahesh

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌ బీజేపీ మాజీ సీఎం, సీనియర్‌ నేత ఉమాభారతి సొంత పార్టీ పైనే అసహనం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో BJP చేపడుతున్న మెగాయాత్రకు తనను ఆహ్వానించకపోవడం పై మండిపడ్డారు.

ప్రధాని మోడీ కంటే తాను వయసులో చిన్నదానినని, మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను పోస్టర్‌ గర్ల్‌గా వుండదల్చుకోలేదని పేర్కొన్నారు. తనను ర్యాలీకి ఆహ్వానిస్తే ప్రజల దృష్టి తన పైనే ఉంటుందని బీజేపీ నేతలు భయపడి నన్ను యాత్రకి పిలవలేదని అన్నారు.